హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని వనస్థలిపురం పరిధిలోని జై భవాని నగర్లో రైతుబజార్ వద్ద నిర్మించిన 324 డబుల్బెడ్రూం ఇళ్లను బుధవారం కేటీఆర్ ప్రారంభించారు. పేదోడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్ధేశమన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఇండ్లు నిర్మించలేదని తెలిపారు. రెండు పడక గదులు ఒక హాల్ ,కిచెన్తోపాటు రెండు బాత్రూమ్లను నిర్మించినట్లు చెప్పారు. ఒక్కో ఇంటికి రూ.9లక్షల ఖర్చు పెట్టి నిర్మించినట్లు పేర్కొన్నారు. దాదాపు రూ.50 లక్షలు విలువ చేసే ప్లాట్ను పేదలకు సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో 3 బ్లాక్లుగా 9 అంతస్తుల్లో ఈ ఇండ్లను రూ.28 కోట్ల వ్యయంతో నిర్మించామని చెప్పారు. ఇండ్ల ప్రారంభంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి , ఎమ్మెల్సీ ఈగ మల్లేశం, గ్రేటర్ మేయర్ బొంతురామ్మోహన్ , ఎమ్మెల్యే శ్రీదేవిరెడ్డి సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.