ఐదుగురు మంత్రులు అవుట్..ఎక్కడంటే !?

ఐదుగురు మంత్రులు అవుట్..ఎక్కడంటే !?

ఐదుగురు మంత్రులు అవుట్..ఎక్కడంటే !?

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఐదుగురు డిప్యూటీ సీఎంలతో కలిపి 25 మందితో తొలి కేబినెట్ రూపకల్పన చేశారు. పక్కా సామాజిక సమీకరణాలను అమలు చేశారు. వారిని రెండున్నరేళ్లకు మారుస్తానని చెప్పిన సీఎం జగన్ అదే విధంగా 11 మంది పాతవారిని కొనసాగిస్తూ మరో 14 మందికి కొత్తగా ఛాన్స్ ఇస్తూ కేబినెట్ ప్రక్షాళన చేశారు. అయితే, ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ, పాలనా – పార్టీ పరంగా మంత్రులు -ఎమ్మెల్యేల పని తీరుపైన సీఎం జగన్ సర్వే నివేదికలతో సిద్దమయ్యారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్ ఊహించని విధంగా ఐదుగురు మంత్రులపైన వేటుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. తప్పిస్తున్న మంత్రుల ద్వారా ఎక్కడా సామాజిక సమీకరణం దెబ్బ తినకుండా కొత్త వారి ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా కొత్తగా ఎమ్మెల్సీలు ఖరారు విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

 

ఇప్పుడు అనూహ్యంగా మంత్రుల పని తీరు ఆధారంగా వారి పైన వేటు వేసేందుకు జగన్ సిద్దమయ్యారు. దీంతో..ఇప్పటి వరకు పని తీరు మెరుగు పర్చుకోవాలంటూ హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు శాసనమండలిలో వైసీపీకి కొత్తగా 18 మంది ఎమ్మెల్సీలు రానున్నారు. పార్టీ కోసం సేవ చేసి, పదవులు దక్కని వారికి ఈ సారి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీ – ప్రభుత్వంలో అనుభవం ఉన్న వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులుగా తీసుకోవాలని నిర్ణయించిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత కేబినెట్ విస్తరణకు అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఎవరి పైన వేటు వేస్తారు, ఎవరికి కేబినెట్ లో సీటు ఇస్తారనేది ఉత్కంఠకు దారితీస్తోంది. ప్రస్తుతం సీఎం ఇదే కసరత్తులో బిజీగా ఉన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావటం కోసం పని తీరు ప్రామాణికంగా సీఎం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.