27న మరోసారి ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపిక

27న మరోసారి ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపిక

27న మరోసారి 'డబుల్' లబ్ధిదారుల ఎంపిక
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: ఈనెల 27న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఈ నెల 27న ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా ద్వారా 21వేల మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27న హైదరాబాద్ కలెక్టరేట్ లో లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఇప్పటికే మొదటి,రెండో విడతల్లో ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఎంతో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. 24900 ఇండ్లను లబ్ధిదారులకు అందచేయనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. సెప్టెంబర్ 27న నిర్వహించే డ్రాలో 3,4 విడతలకు సంబంధించి 21 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న 10,500 మందికి, అక్టోబర్ 5న మరో 10,500 మంది లబ్ధిదారుల ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఎంతో పారదర్శకంగా రాజకీయ జోక్యం లేకుండా పార్టీలకు అతీతంగా ఇండ్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.