తెలంగాణలో కరోనా ఆంక్షలు..

తెలంగాణలో కరోనా ఆంక్షలు..హైదరాబాద్ : ఒమిక్రాన్ విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వం కీలక చర్చలు చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా తాత్కాలిక కొవిడ్ ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది.

అలాగే ఇతర కార్యక్రమాల్లో మాస్క్ లు ధరించడం, భౌతికదూరం నిబంధనలు పాటించడం తప్పనిసరి చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 38 నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా కొత్త వేరియంట్ విస్తరించకుండా ఉండేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.