డీజీపీ మహేందర్ రెడ్డికి హోం మంత్రి సన్మానం

డీజీపీ మహేందర్ రెడ్డికి హోం మంత్రి సన్మానం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : డీజీపీ ఎం.మహేందర్ రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు సన్మానించారు. హైదరాబాదులోని లకిడికాపూల్ హోం మంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చార్మినార్ జ్ఞాపికను హోం మంత్రి డీజీపీకి బహూకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని హోంశాఖ మంత్రి ప్రశంసించారు.డీజీపీ మహేందర్ రెడ్డికి హోం మంత్రి సన్మానంవిధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా, రాష్ట్ర డీజీపీగా నూ, దాదాపు 34 సంవత్సరాల పాటు పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారని మహమ్మద్ మహమూద్ అలీ ప్రశంసించారు. ఐదు సంవత్సరాలకు పైగా డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి తెలంగాణ పోలీసుశాఖను అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.