బండారు దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

బండారు దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

నల్గొండ జిల్లా: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కార్ స్టీరింగ్ రన్నింగ్ లోనే ఒక్కసారిగా లాక్ అవ్వడంతో అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినప్పటికీ ..ఈ ప్రమాదంలో దత్తాత్రేయ సహాయకుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అనంతరం దత్తాత్రేయ వేరే వాహనంలో తన పర్యటన కోసం నల్గొండకు బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఇన్ స్పెక్టర్ వెంకన్నలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు.