బీడీఎస్ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ జారీ 

బీడీఎస్ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ జారీ

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : రాష్ట్రంలోని బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు వెబ్ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం నేడు మాప్ అప్ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. బీడీఎస్ ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ జారీ కన్వీనర్ కోటలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 న మధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు వెబ్ ఆఫ్ష‌న్లును నమోదు చేసుకోవచ్చు. గత విడత కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా అదే విధంగా అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ కు అనర్హులు. ఇత‌ర వివ‌రాల‌కు www.knruhs.telangana.gov.inవెబ్ సైట్లో సంప్ర‌దించాల‌ని యూనివ‌ర్శిటీ వ‌ర్గాలు సూచించాయి.