కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు 

కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు

కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు 

వరంగల్ టైమ్స్, జగిత్యాల జిల్లా : పవన్ కళ్యాణ్ పత్యేకంగా తయారు చేయించిన జనసేన ప్రచార రథం వారాహి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. కొండగట్టు ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. జనసేన పార్టీ అభివృద్ధికి, లోక కల్యాణానికి, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోరుతూ పార్టీ ప్రచార రథానికి పండితులు పూజలు చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ ను వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు.

మొదట కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంలో పూజలు నిర్వహించిన పవన్, వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మరో పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారికి పూజలు నిర్వహించారు. పవన్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందచేశారు.

కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు అభిమానుల సందడితో కొండగట్టు ఆలయ పరిసరాలు హోరెత్తాయి. వారాహికి ప్రత్యేక పూజలు పూర్తయ్యాక వాహనంలోకి ఎక్కి ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలకు పవన్ అభివాదం చేశారు. కాగా ఉదయం 11 గంటలకే పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకోవాల్సి ఉండగా, ట్రాఫిక్ అంతరాయం కారణంగా కొద్దిగా ఆలస్యంగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేనానికి అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.