తెలుగు రాష్ట్రాలకు కార్తీక శోభ

తెలుగు రాష్ట్రాలకు కార్తీక శోభరాజన్నసిరిసిల్లా జిల్లా ‌: తెలుగు రాష్ట్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు, నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తితో పాటు వేములవాడ రాజరాజేశ్వస్వామి ఆలయాలు భక్తులు తరలివచ్చారు. అలాగే పంచారామక్షేత్రాలు భక్తులతో సందడిగా కనిపించాయి. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని.. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం వద్ద గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. అనంతరం నదిలో దీపాలను వదిలారు. అలాగే కార్తీక మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం నుంచి నిత్యం సాయంత్రం గోదావరి నదీహారతి కార్యక్రమం కనుల పండువగా జరుగనుంది.

తెలుగు రాష్ట్రాలకు కార్తీక శోభ