పోడుభూముల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

పోడుభూముల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీహైదరాబాద్ : తెలంగాణలో పెండింగ్ లో ఉన్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఈ భేటీ జరుగుతోంది. మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ భేటీలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ హాజరయ్యారు.

సెప్టెంబర్ 16న జరిగిన మంత్రి మండలి సమావేశంలో పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ , సూచనల కోసం సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆగస్టులో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ పోడుభూములకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.