కుప్ప కూలిన మిగ్ -21 విమానం

కుప్ప కూలిన మిగ్ -21 విమానంరాజస్థాన్ : రాజస్థాన్ లోని జైసల్మేర్ వద్ద వైమానిక దళానికి చెందిన మిగ్ -21 విమానం కుప్పకూలింది. ఈ ఘటన సుదాసిరి గ్రామంలో జరిగినట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో పైలట్ మృతి చెందాడు. రెస్క్యూ ఆపరేషన్ కోసం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐతే ఏ కారణాల రీత్యా ఇది కుప్పకూలిందన్న సమాచారం తెలియాల్సింది.