సత్యనాదెళ్లను కలిసిన మంత్రి కేటీఆర్

సత్యనాదెళ్లను కలిసిన మంత్రి కేటీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇండియా టూర్ లో ఉన్నారు. రెండ్రోజుల క్రితం ఆయన ప్రధాని మోడీని కలిశారు. ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. సత్యనాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించినట్లు కూడా మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.సత్యనాదెళ్లను కలిసిన మంత్రి కేటీఆర్బెంగళూరులో జరిగిన ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సమ్మిట్ లో ‘చాట్ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ రోబోను నాదెళ్ల పరిచయం చేశారు. ఆ రోబోతో ఆయన మట్లాడారు. భవిషత్యత్తులో పాపులర్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఏముంటాయని ఆయన చాట్ రోబోను ప్రశ్నించగా, ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్యనాదెళ్ల..బిర్యానీని సౌత్ ఇండియా టిఫిన్ అని తనను అవమానించొద్దన్నారు. దీంతో వెంటనే చాట్ రోబో క్షమాపణ చెప్పింది.