రోహిత్ శర్మ పాసైయాడు

రోహిత్ శర్మ పాసైయాడుస్పోర్ట్స్ డెస్క్: కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కావడంతో లీగ్ స్టేజ్ లో పలు మ్యాచ్ లు ఆడలేకపోయాడు. అయితే అతను త్వరలోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం దొరికింది. టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ శుక్రవారం నిర్వహించిన ఫిట్ నెస్ పరీక్షలో పాసయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనకు అనుమతించడానికి బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన పరీక్షలో రోహిత్ శర్మ అర్హత సాధించాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో బీసీసీఐ …ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి మూడు జట్లను ప్రకటించగా అందులో రోహిత్ పేరు లేదు. అనంతరం రోహిత్ ప్లే ఆఫ్స్ , ఫైనల్స్ లో ఆడి ముంబయి జట్టును ఐదోసారి విజేతగా నిలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో హిట్ మ్యాన్ ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడాన్ని పలువురు విమర్శించినప్పటికీ బీసీసీఐ స్పందించింది. రోహిత్ ను టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేసింది. అంతకన్నా ముందు పూర్తి ఫిట్ నెస్ సాధించాలని చెప్పింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ముగిశాక రోహిత్ శర్మ తిరిగి భారత్ కు చేరుకున్నారు. మరోవైపు టీం ఇండియా అతను లేకుండానే ఆస్ట్రేలియా బయల్దేరింది. రోహిత్ ఎన్ సీఏ లో ఉంటూ పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే ఆలస్యం. ఒకవేళ రోహిత్ మరికొద్ది రోజుల్లో అక్కడికి వెళితే చివరి రెండు టెస్టులు ఆడే అవకాశం వుంది. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్ట్ తర్వాత భారత్ కు తిరిగి వస్తుండటంతో రోహిత్ జట్టుతో కలవడం చాలా ముఖ్యమైన విషయం.