కేయూ లో ఆ పరీక్షలు వాయిదా

హనుమకొండ జిల్లా : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యా కేంద్రంలో ఈనెల 15న జరగాల్సిన ఎంబీఏ ఫస్టియర్ రెండో సెమిస్టర్ బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ పేపర్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను జనవరి 19కి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి తెలిపారు. అలాగే ఎంబీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ రూరల్ మార్కెటింగ్ స్ట్రాటజెమ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పేపర్, కంపాన్సెషన్ మేనేజ్మెంట్ పేపర్ల పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు వెల్లడించారు.