జూన్ 12న టెట్  

జూన్ 12న టెట్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుండగా, జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వాలని సీఎం అసెంబ్లీలో ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు.జూన్ 12న టెట్  మొత్తం 80,039 పోస్టులకు మొదటి విడత 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ బుధవారం అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదలయ్యాయి. గ్రూప్ – 1, హోంశాఖ, జైళ్లు, రవాణాశాఖలు , వైద్య, ఆరోగ్యశాఖల్లోని పోస్టులతో పాటు టెట్ నిర్వహణకు సైతం ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే విద్యాశాఖ టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది.