భారత్ లో 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు

భారత్ లో 781కి చేరిన ఒమిక్రాన్ కేసులున్యూఢిల్లీ : భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఒక్క రోజులోనే 127 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి చేరింది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు, మహారాష్ట్రలో 167, గుజరాత్ లో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్థాన్ లో46, తమిళనాడులో 34, కర్ణాటకలో 34 చొప్పున ఒమిక్రాన్ కేసులున్నాయి. 241 మంది ఒమిక్రాన్ బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోవైపు ఒమిక్రాన్ విజృంభనతో భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 6వేలకు పైగా నమోదుకాగా, తాజాగా 44 శాతం అధికంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9195 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,48,08,886కు చేరాయి. ఇందులో 3,42,51,292 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 4,80,592 మంది మృతి చెందారు. మరో 77,002 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.