తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను హన్మకొండకు, కుమ్రంభీం కలెక్టర్ రాహుల్ రాజ్ ను ఆదిలాబాద్ కలెక్టర్ గా బదిలీ చేసింది.నారాయణరెడ్డిని వికారాబాద్ కలెక్టర్ గా, వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాను కుమ్రంభీం ఆసిఫాబాద్ కు, మెదక్ కలెక్టర్ ఎస్.వెంకట్రావును సూర్యాపేట కలెక్టర్ గా, ఎస్.హరీష్ రావును రంగారెడ్డి, రాజశ్రీ షాను మెదక్ కలెక్టర్ గా నియమించింది.

మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ తేజ ఎస్ పవార్ వనపర్తి కలెక్టర్ గా, ఉట్నూరు ఐటీడీఏ పీవో క్రాంతి వరుణ్ రెడ్డి నిర్మల్ కలెక్టర్ గా, కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు జగిత్యాల కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించిందవి. హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును నిజామాబాద్ కు బదిలీ చేసింది. అమయ్ కుమార్ ను మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్ గా నియమించడంతో పాటు హైదరాబాద్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది.