పొంగల్ రోజు టీఎస్ఆర్టీసీ ఆదాయం ఎంతో తెలుసా ?

పొంగల్ రోజు టీఎస్ఆర్టీసీ ఆదాయం ఎంతో తెలుసా ?హైదరాబాద్ : సంక్రాంతి పండుగకు టీఎస్ ఆర్టీసికి భారీగా ఆదాయం వచ్చింది. ఈ పండుగకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 4వేల బస్సులను టీఎస్ఆర్టీసీ నడిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా దాదాపు 55 లక్షలకు పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు టీఎస్ ఆర్టీసీ చేర్చింది. దీంతో టీఆఎస్ ఆర్టీసికి రూ. 107 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసిని ఆదరించిన ప్రయాణికులకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా ఇదే విధంగా టీఎస్ ఆర్టీసి సంస్థను ఆదరిస్తూ, సంస్థ అభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.