నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్‌ కోటాకు వెబ్ కౌన్సెలింగ్‌ 

నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్‌ కోటాకు వెబ్ కౌన్సెలింగ్‌

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి ఏప్రిల్ 7, 8న రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. మొదటి విడత తరవాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి బుధవారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ నెల 7న ఉదయం 8 గంటల నుంచి 8 న మధ్యాహ్నం 2 గంటల వరకు తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా అదే విధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in ను చూడవలసిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.