మార్చి 5న ఢిల్లీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  

మార్చి 5న ఢిల్లీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మార్చి 5న ఢిల్లీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మార్చి 5న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి వెళ్లనున్నారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఎంపీలు జయంత్ చౌదరీ, సంజయ్ సింగ్ , హాకీ ఇండియా ప్రెసిడెంట్, మాజీ ఎంపీ దిలీస్ టిర్కే హాజరవుతారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులకు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, షట్లర్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్ నామినేట్ అయ్యారు.