రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మృతి

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. క్వీన్స్ లాండ్ లోని టౌన్స్ విల్లేలో శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ చనిపోయాడు. క్వీన్స్ లాండ్ లో శనివారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. తీవ్ర గాయాలైన ఆండ్రూను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో సైమండ్స్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వేగంగా వెళ్తున్న కారు బోల్తాపడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాద సమయంలో సైమండ్స్ మాత్రమే కారులో ఉన్నట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మృతిఆండ్రూ సైమండ్స్ వేగంగా మృతితో క్రీడా ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆస్ట్రేలియా క్రికెట్ టీం అతడికి సంతాపం వ్యక్తం చేసింది. పలువురు క్రికెటర్లు, ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సైమండ్స్ 1998 నుంచి 2009 వరకు మొత్తం 26 టెస్టులు, 39 ఐపీఎల్, 14 టీ20లు, 198 వన్డే మ్యాచ్ లు ఆడాడు. ఆస్ట్రేలియా 2003, 2007 వన్డే వరల్డ్ కప్ టీం లో సభ్యునిగా ఉన్నాడు. వన్డేల్లో 5088 రన్స్, 13 వికెట్లు, టెస్టుల్లో 1462 రన్స్, టీ 20ల్లో 337 రన్స్ చేశాడు.