బ్యూరోక్రాట్ల క్యాడర్ కేటాయింపు 27కు వాయిదా

బ్యూరోక్రాట్ల క్యాడర్ కేటాయింపు 27కు వాయిదా

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కేటాయింపు విచారణను టీఎస్ హైకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. 12 మంది బ్యూరోక్రాట్ ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జయ్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ నేడు విచారణ చేపట్టింది. ట్రిబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అభిప్రాయపడ్డారు. అన్ని పిటిషన్ లను రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందని సూచించారు. ఐతే వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని అధికారుల తరపు అడ్వకేట్ లు కోర్టుకు తెలుపగా తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది.బ్యూరోక్రాట్ల క్యాడర్ కేటాయింపు 27కు వాయిదాఏపీ క్యాడర్ కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్ల క్యాడర్ క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీ హోదాలో ఉన్న అంజనీ కుమార్ కూడా ఏపీ క్యాడరే. ఆయనతో పాటు ఐపీఎస్ లు సంతోష్ మెహ్రా, అభిలాష్ భిష్త్ ఉన్నారు. ఐఏఎస్ లలో టీఎస్పీఎస్సీ సెక్రటరీగా ఉన్న వాణీప్రసాద్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రాస్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఆయుష్ కమిషనర్ ఎ.ప్రశాంతి, మరో ఐఏఎస్ సేతు మాధవన్, కాటా ఆమ్రపాలి ఏపీలో పనిచేయాల్సి ఉండగా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణ క్యాడర్ లో పనిచేస్తున్నారు.

అయితే సోమేశ్ కుమార్ క్యాడర్ విషయంలో వారం కిందటే హైకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగా డీవోపీటీ ఆదేశాలు రావడంతో ఆయన తెలంగాణలో సీఎస్ పోస్టును వదులుకుని, రెడ్రోజుల వ్యవధిలోనే ఏపీలో రిపోర్ట్ చేశారు. సోమేశ్ కుమార్ కు వచ్చిన జడ్జిమెంట్ మాదిరే వీళ్లకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ లు శివశంకర్ లహోటి, హరి కిరణ్, గుమ్మల్ల సృజన ఏపీలో పనిచేస్తున్నారు.