చెర్వుగట్టు ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చెర్వుగట్టు ఆలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనవరంగల్ టైమ్స్, నల్లగొండ జిల్లా : నార్కట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంనందు ఆదివారం పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దేవాలయం నందు రూ. 7 కోట్ల పైచిలుకు పనులకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తో కలిసి శంకుస్థాపన చేశారు. మొదట గట్టుకింద అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన వసతి షెడ్డును వారు ప్రారంభించారు. రాజగోపురం వద్ద రూ.3.10 కోట్లతో నిర్మించిన 30 గదులను ప్రారంభించారు. అనంతరం గుట్టపైన 2.4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న కల్యాణ మండపం విస్తరణ పనులకు, రూ.1.28 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. చివరగా రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గోశాలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.