‘గ్రేటర్‌’ మూడో జాబితా విడుదల చేసిన తెరాస

హైదరాబాద్‌ : గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్న 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను టీఆర్‌ఎస్‌ పార్టీ శుక్రవారం ప్రకటించింది. బుధవారం తొలి విడతలో 105 మంది తొలి జాబితాను విడుదల చేయగా.. గురువారం 20 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. తాజాగా మూడో విడతలో 25 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ టికెట్‌ పొందిన పలువురు అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేశారు. ప్రచారంపై దృష్టి సారించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

అభ్యర్థులు వీళ్లే
01. వెంగళ్‌రావునగర్‌ – దేదీప్యారావు

02. రహమత్‌నగర్‌ – సీఎన్‌రెడ్డి

03. నేరెడ్‌మెట్‌ – మీనా ఉపేందర్‌రెడ్డి

04. ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌ – ప్రేమ్‌కుమార్‌

05. గౌతమ్‌నగర్‌ – మేకల సునీతా రాముయాదవ్‌

06. గోల్నాక – దాసరి లావణ్య

07. చందానగర్‌ – మంజూల రఘునాథరెడ్డి

08. హైదర్‌నగర్‌ – నార్నె శ్రీనివాసరావు

09. తార్నాక – మోతె శ్రీలత

10. మౌలాలి – ముంతాజ్‌ ఫాతిమా

11. ఏఎస్‌రావునగర్‌ – పావనిరెడ్డి

12. చర్లపల్లి – బొంతు శ్రీదేవియాదవ్‌

13. మీర్‌పేట హెచ్‌బీ కాలనీ – జెర్రిపోతుల ప్రభుదాస్‌

14. నాచారం – శాంతి సాయిజన్‌ శేఖర్‌

15. చిలుకానగర్‌ – బన్నాల ప్రవీణ్‌ గీతాముదిరాజ్‌

16. హబ్సీగూడ – భేతి స్వప్నారెడ్డి

17. ఉప్పల్‌ – అరటికాయల శాలినీ భాస్కర్‌ ముదిరాజ్‌

18. అత్తాపూర్‌ – మాధవి అమరేందర్‌రెడ్డి

19. కాచిగూడ – డాక్టర్‌ శిరీష యాదవ్‌

20. నల్లకుంట – గరికంటి శ్రీదేవి

21. అంబర్‌పేట – విజయ్‌కుమార్‌ గౌడ్‌

22. ముషీరాబాద్‌ – ఎడ్ల భాగ్యలక్ష్మీ యాదవ్‌

23. కవాడిగూడ – లాస్య నందిత

24. యూసుఫ్‌గూడ – రాజ్‌కుమార్‌ పటేల్

25. అడిక్‌మెట్‌ – హేమలతారెడ్డి