సభ ఏర్పాట్లను పరిశీలించిన రవిచంద్ర, మధు

సభ ఏర్పాట్లను పరిశీలించిన రవిచంద్ర, మధు

వరంగల్ టైమ్స్, ఖమ్మం జిల్లా : బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఖమ్మం సభా ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆదివారం ఉదయం పరిశీలించారు. జనవరి 18న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరుగనుంది. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం, పక్కనే ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు 5 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు.సభ ఏర్పాట్లను పరిశీలించిన రవిచంద్ర, మధుఈ దృష్ట్యా బహిరంగ సభను విజయవంతం చేసేందుకై బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు గంటన్నరకు పైగా మైదానమంతా కలియతిరిగి ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్టేజీ నిర్మాణం, వాహనాల పార్కింగ్, ఎల్ఈడీ స్క్రీన్స్, సీటింగ్ ఏర్పాట్లు, వీఐపీ, కళాకారులు, ప్రెస్ అండ్ మీడియా గ్యాలరీలు తదితర ఏర్పాట్లను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. సభ ఏర్పాట్లకు సంబంధించిన మ్యాపును పరిశీలించి బీఆర్ఎస్ నాయకులు, పోలీసు, ట్రాఫిక్ అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్సీ వెంట జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణు తదితరులు ఉన్నారు.