NTPCలో 177 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

NTPCలో 177 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కల్గిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 177 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో మైనింగ్ సిర్దార్, మైనింగ్ ఓవర్ మ్యాన్ పోస్టులున్నాయి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం పోస్టులు : 177 ఇందులో మైనింగ్ సిర్దార్ 103, మైనింగ్ ఓవర్ మెన్ 74 చొప్పున ఖాళీలున్నాయి.
అర్హతలు : మైనింగ్ ఓవర్ మెన్ పోస్టులకు ఇంజినీరింగ్ లో డిప్లొమా పూర్తి చేసి, ఓవర్ మ్యాన్ సర్టిఫికెట్ కల్గిఉండాలి. మైనింగ్ సిర్దార్ పోస్టులకు 10వ తరగతి పాసై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు ఫీజు : రూ. 300
దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 15
వెబ్ సైట్ : www.ntpc.co.in