ఆన్​లైన్​ ఆడిట్​లో తెలంగాణ అద్భుత ప్రతిభ

సీఎస్​ఐ-ఎసైజీ అవార్డు జ్యూరీ ఎదుట తెలంగాణ ఆడిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
జ్యూరీ సభ్యుల అభినందనలుఆన్​లైన్​ ఆడిట్​లో తెలంగాణ అద్భుత ప్రతిభహైదరాబాద్​: కంప్యూటర్ సొసైటీ అఫ్ ఇండియా, స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అవార్డు జ్యూరీ ఎదుట తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ, ఎన్​ఐసీ ఢిల్లీలు తెలంగాణ ఆన్​లైన్​ ఆడిట్ విధానం అద్భుతం గా ఉన్నందని తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగా (సీఎస్​ఐ-ఎసైజీ ) కంప్యూటర్ సొసైటీ అఫ్ ఇండియా –స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అవార్డు జ్యూరీ ఆధ్వర్యంలో రాష్ట్రాల ఆడిట్ సంచాలకులు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భం గా తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (సీఎస్​ఐ-ఎసైజీ )పై జ్యూరీ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. కరోన విపత్కర పరిస్థతిలో తెలంగాణలోని 12796 గ్రామ పంచాయతీలకు గానూ 5152 పంచాయతీలు నిర్వహించిన తీరు అద్భుతమన్నారు. తెలంగాణలో నిర్వహించిన 5152 గ్రామ పంచాయతీలను 52 రోజుల్లోనే నిర్వహించినట్లు తెలంగాణ సంచాలకులు తెలిపారు. ఆన్​లైన్​లో నే ఆడిట్ చేసి ఆడిట్ నివేదికలను గ్రామ పంచాయతీలకు కు పంపమన్నారు. 5152 గ్రామ పంచాయతీలను ఆడిట్ చేసి 56520 అభ్యంతరంలు నమోదు చేసినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్​లో వివరించారు. రెండు దశల్లో ఆన్​లైన్​ ఆడిట్ నిర్వహించినట్లు, మొదటి విడత 3225 గ్రామపంచాయతీలు, రెండో విడత 1927 గ్రామపంచాయతీలు నిర్వహించామన్నారు. 2019-20లో 40% గ్రామపంచాయతీలను ఆన్​లైన్​ ఆడిట్ నిర్వహించినట్లు, రాన్నున్న 2020-21 లో 100% ఆన్​లైన్​ ఆడిట్ నిర్వహించనున్నట్లు, 2021-22 లో గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు 100% ఆన్​లైన్​లో ఆడిట్ చేయనున్నట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ సంచాలకులు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రాల ఆడిట్ సంచాలకు లు, పంచాయతీ రాజ్ అధికారులు ఉన్న జ్యూరీసభ్యులు మాత్రమే తెలంగాణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పట్ల ఆసక్తి చూపి సమయం ఎక్కువ కేటాయించి ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఆడిట్ శాఖ అనుసరించిన విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని జ్యూరీ సభ్యులు సూచించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్​ ఆడిట్ అధికారులకు తెలంగాణ సంచాలకులు శిక్షణ ఇవ్వడాన్ని (సీఎస్​ఐ-ఎసైజీ జ్యూరీ సభ్యులు, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ కార్యదర్శి సేదీ అభినందించారు. (సీఎస్​ఐ-ఎసైజీ )జ్యూరీసభ్యులు ఆన్​లైన్​ ఆడిట్ అప్లికేషన్​ రుపొంచిన విధానం, ఆడిట్ నివేదికలు పొందుపరిచి పంచాయతీలకు పంపేలా తీసుకున్న చర్యలు అద్భుతమని సభ్యులు, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ కార్యదర్శి కె ఎన్ సేధీ పేర్కొన్నారు. ఇక పై ఆన్​లైన్​ లోనే గ్రామ పంచాయతీల ఆడిట్ నిర్వహించాలని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సేతి రాష్ట్రాలను ఆదేశించింది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఆర్ధికశాఖ కార్యదర్శిలు ఇక నుంచి ఆన్​లైన్​లోనే గ్రామ పంచాయతీల మిగిలిన అన్ని ఆడిట్ లు చేసేలా చూడాలని తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు కు సూచించారు. శుక్రవారం సంచాలకుల కార్యాలయం లో జిల్లాల అధికారులతో రివ్యు సమావేశం నిర్వహించారు. ఇక నుంచి ఆన్​లైన్​లోనే గ్రామ పంచాయతీల ఆడిట్ 2020-21 లో 50 % ఆన్​లైన్​లో మండల పరిషత్ ల ఆడిట్ తదితర అంశాలఫై చేస్తామని తెలంగాణ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్స్ ద్రాక్షాయిని, ఇందిర రాణి, రాము, రేవతి, వెంకటేశం జిల్లాల అధికారులు పాల్గొన్నారు.