ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ రోడ్రిగ్స్ ఇకలేరు

ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ రోడ్రిగ్స్ ఇకలేరు

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ సునిత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ నేడు కన్నుమూశారు. ఆయన వయసు 88 యేళ్లు. 1990 నుంచి 1993 వరకు ఆయన ఇండియన్ ఆర్మీ చీఫ్ గా చేశారు. 2004 నుంచి 2010 వరకు పంజాబ్ గవర్నర్ గా కూడా చేశారు. 1933లో ఆయన ముంబైలో జన్మించారు. మాజీ ఆర్మీ చీఫ్ మృతి పట్ల జనరల్ ఎంఎం నరవాణేతో పాటు ఇతర ఆఫీసర్లు నివాళి అర్పించారు. ఆలోచనాపరుడిగా, వ్యూహకర్తగా రోడ్రిగ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అకుంఠిత దీక్షతో ఆయన దేశ సేవలో పాల్గొన్నట్లు ఆర్మీ తెలిపింది.ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ రోడ్రిగ్స్ ఇకలేరు