జేఈఈ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు

జేఈఈ పరీక్షల షెడ్యూల్ లో మార్పులు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : జేఈఈ పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్టీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలి సెషన్ ను మొదట జనవరి 24, 25, 27, 29, 30, 31 తేదీల్లో నిర్వహించాలని భావించింది. ఐతే ఇప్పుడు 24, 25, 28, 29, 30, 31, ఫిబ్రవరి 1న నిర్వహించనున్నట్లు పేర్కొంది. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో యథావిధిగా జరుగుతాయి. విద్యార్థులు ఇది గమనించాలని, ఎగ్జామ్ సెంటర్ స్లిప్పులను ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు ఎన్టీఏ తెల్పింది.

అలాగే జనవరి 28న బీఆర్క్, బీ ప్లానింగ్ విభాగంలో పేపర్-2ఏ, 2బీ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్ష జరిగే నగరాల సమాచారానికి సంబంధించిన స్లిప్ ను అభ్యర్థులు చెక్ చేసుకోవాలని కోరింది. తదుపరి వివరాల కోసం ఎప్పటికప్పుడు తమ వెబ్ సైట్ https://jeemain.nta.nic.in/ను చెక్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.