భారత్ లో 95.3 కోట్లకు పైగా ఓటర్లు : సీఈసీ

భారత్ లో 95.3 కోట్లకు పైగా ఓటర్లు : సీఈసీన్యూఢిల్లీ : దేశంలో 95.3 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సుశీల్ చంద్ర అన్నారు. నేడు జరిగిన నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొత్తం ఓటర్లలో 49 కోట్ల మంది పురుషులు, 46 కోట్ల మంది మహిళలున్నారని ఆయన చెప్పారు. మరో 1.92 కోట్ల మంది సీనియర్ సిటిజన్ (60 యేళ్లపై బడిన వారు )లు ఉన్నారని సీఈసీ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు.

ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి ఇస్తున్న గౌరవంగా భావిస్తూ వస్తున్నారని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. కేవలం18 శాతం అక్షరాస్యత ఉందన్నారు. కొత్తగా స్వాతంత్ర్యం సాధించుకున్న దేశం వేగవంతమైన అభివృద్ధికి ఈ రైట్ టు ఓట్ ఎంతో తోడ్పడిందని సుశీల్ చంద్ర వెల్లడించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేర్కొన్నారు.