హైదరాబాద్: దిల్రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైలర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.
‘‘ తెలుగు ప్రేక్షకులకు అడ్వాన్స్గా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇది నాకు నోస్టాలజిక్ డే. ఎందుకంటే ‘ఆది’ సినిమా సమయంలో దిల్ రాజుతో, శిరీష్తో అసోషియేషన్ ఏర్పడింది అన్నారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్. మా శిరీషన్న కొడుకు, సోదర సమానుడు ఆశిష్తో అప్పటి వరకు పరిచయం లేదు. ఇప్పుడు తను రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తన సినిమా ట్రైలర్ను నేను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రాజుతో, శిరీష్తో ఉండే జర్నీని గుర్తు చేసుకున్నట్లు అయ్యింది. రౌడీ బాయ్స్ ట్రైలర్ను లాంచ్ చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆశిష్కి, డైరెక్టర్ శ్రీహర్షకి అభినందనలు అన్నారు ఎన్టీఆర్.
‘‘మా ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ను విడుదల చేసి యూనిట్కు అభినందనలు తెలియజేసిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్గారికి థాంక్స్. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ‘రౌడీ బాయ్స్’ సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్నాం. యూత్ సహా అన్ని వర్గాలకు నచ్చే ఎంటర్టైనర్ ఇది. విక్రమ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు, టీజర్కు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాను కూడా ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్.