ఎల్లుండి నుంచే పెండింగ్ చలానాల చెల్లింపు

ఎల్లుండి నుంచే పెండింగ్ చలానాల చెల్లింపు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: రాంగ్ రూటో.. సీటు బెల్టో, హెల్మెట్ లేదనే కెమెరాల్లో బంధీ కావడం ఖాయం. అయితే ఆ చలానా కట్టాలనే సోయి దాదాపు చాలా మందికి ఉండదు. ఏం చూద్దాంలే అనుకుంటారు. కానీ తీరా కట్టాల్సిందే అంటే అప్పుడు పరుగులు తీస్తారు. ఇక అసలు విషయానికి వస్తే.. చలానాకు సంబంధించి తెలంగాణ సర్కార్ రిబేట్ విధించింది. దీంతో చలానా ఉన్నవారు కట్టేందుకు సిద్దం అవుతున్నారు.ఎల్లుండి నుంచే పెండింగ్ చలానాల చెల్లింపుఎల్లుండి నుంచే..
ట్రాఫిక్ చలానాలు పెండింగ్ ఉన్న వాహనదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెండింగ్ చలానాలా ఈ లోక్ అదాలత్ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి ప్రకటన గతంలో 2, 3 సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అప్పుడు పోలీసు శాఖ పెండింగ్ చలానా లోక్ అదాలత్ చేపట్టలేదు. ఇప్పడు ఇందుకు సంబంధించిన ఫైలు డీజీపీ కార్యాలయానికి చేరింది. ఇన్ చార్జి డీజీపీ ఆమోద ముద్ర వేయటమే మిగిలి ఉంది.

సాప్ట్‌వేర్ అప్‌డేట్..
ఈ లోక్ అదాలత్‌కు అనుగుణంగా అధికారులు ఈ చలానా పోర్టల్‌లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తున్నారు. గత నాలుగేళ్లలో 6.19 కోట్ల మేర వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే వసూల్ అయ్యాయి. మిగతా జరిమానాల కోసం పోలీసు శాఖ ఇప్పుడు రాయితీలు ప్రకటించింది. టూ వీలర్స్ 75 శాతం రాయితీతో ఈ-లోక్ అదాలత్‌లో చలానాలను క్లియర్ చేసుకోవచ్చు. అంటే ద్విచక్ర వాహనంపై రూ.1000 జరిమానా పెండింగ్‌లో ఉంటే రాయితీ పోగా రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి రూ.35 సర్వీస్ చార్జీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ వెబ్ ‌సైట్ ఓపెన్ చేస్తే చాలు..
వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్‌ https://echallan.tspolice.gov.in/publicviewలో పెండింగ్‌ చలానాలను రాయితీతో చెల్లించేలా పోలీసు శాఖ పోర్టల్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. ఈ అప్ డేట్ సాఫ్ట్ వేర్ మార్చి1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. పోర్టల్ అప్ డేట్ చేస్తున్నందున ప్రస్తుతం ఈ చలానా స్టేటస్ సేవలను నిలిపివేశారు. త్వరలో పోర్టల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.