రికార్డు స్థాయిలో ధర పలికిన మిర్చి, పత్తి

రికార్డు స్థాయిలో ధర పలికిన మిర్చి, పత్తి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో బంగారంతో పాటు మిర్చి ధరలు పోటీ పడి పెరుగుతున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో పత్తి, దేశీ మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది.రికార్డు స్థాయిలో ధర పలికిన మిర్చి, పత్తిక్వింటాల్ సింగిల్ పట్టి మిర్చి ధర రూ.40 వేలు, పత్తి ధర రూ.10,100. మిర్చి, పత్తికి ఇంత ధర పలకడం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కాగా, ఆరుగాలం శ్రమించిన రైతులకు కాసుల వర్షం కురుస్తుండటంతో సంతోషిస్తున్నారు.