టీటీడీ పాలకమండలి జాబితా విడుదల

టీటీడీ పాలకమండలి జాబితా విడుదలతిరుపతి : 25 మందితో టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితాను ఏపీ ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ఇప్పటికే టీటీడీ ఛైర్మెన్ గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యులుగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, శశిధర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, లక్ష్మీనారాయణ, మూరం శెట్టి రాములు, నంద కుమార్, జూపల్లి రామేశ్వర్ రావు, రాజేశర్మ, జీవన్ రెడ్డి, పార్ధసారథిరెడ్డి, పోలకల ఆశోక్, మల్లాడి కృష్ణారావు, శంకర్, విశ్వనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, గొల్ల బాబురావు, మధుసూదన్ యాదవ్ తదితరులకు చోటు దక్కింది.

టీటీడీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. కోస్తా నుంచి కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ , ఉత్తరాంధ్ర నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు, రాయలసీమ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డకి చోటు దక్కింది. కర్ణాటక నుంచి శశిధర్, శంకర్, డాక్టర్ కేతన్ దేశాయ్ కి చోటు లభించింది. తెలంగాణ నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మూరం శెట్టి రాములు, నంద కుమార్, జూపల్లి రామేశ్వరరావు, రాజేశర్మ, పార్ధసారథిరెడ్డి, జీవన్ రెడ్డి, లక్ష్మీనారాయణలకు చోటు దక్కింది.