ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత

ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా హెరాయిన్ పట్టుబడింది. జోహెన్నెస్ బర్గ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికుడి వద్ద మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. గత నెల 26న జోహెన్నెస్ బర్గ్ నుంచి ఓ ప్రయాణికుడు హైదరాబాద్ కు వచ్చాడు.ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేతఈ సందర్భంగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో పట్టుకున్నారు. నిందితుడు 108 క్యాప్సుల్స్ మింగినట్లు గుర్తించారు. డాక్టర్ల పర్యవేక్షణలో వాటిని బయటికి తీశారు. అవి 1389 గ్రాముల బరువు ఉన్నాయని, వాటి విలువ రూ. 11.53 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని విచారిస్తున్నామని తెలిపారు.