ఐనవోలులో ఘనంగా భోగి, సంక్రాంతి వేడుకలు

ఐనవోలులో ఘనంగా భోగి, సంక్రాంతి వేడుకలు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఘనంగా భోగి, సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించారు ఉత్సవాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, డిసిబి చైర్మన్ మారినేని రవీందర్ రావు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు.ఐనవోలులో ఘనంగా భోగి, సంక్రాంతి వేడుకలుఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు ఆహుతులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఈ పండుగ రోజు అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

ఆలయ ప్రాంగణంలో శివసత్తుల పూనకాలు, మల్లికార్జున స్వామి పట్నాలు, ప్రభల ఊరేగింపులతో ఆలయ ప్రాంగణమంతా మల్లికార్జున స్వామి నామస్వరణలతో మారుమోగాయి. పండుగ సందర్భంగా సెలవులు రావడంతో ఐనవోలు కేంద్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఐలోని మల్లన్నకు బండారి, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఐనవోలులో ఘనంగా భోగి, సంక్రాంతి వేడుకలుఆలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్యశాఖ ఎక్సైజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ టూరిజం తదితర శాఖలో నుండి సేవా కార్యక్రమాలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ఆలయ సిబ్బంది నూతనంగా ఎన్నిక కాబడిన అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.