కోడిపుంజుకు టికెట్..ఆ పై ఏం జరిగిందంటే..?

కోడిపుంజుకు టికెట్..ఆ పై ఏం జరిగిందంటే..?

వరంగల్ టైమ్స్, పెద్దపల్లి జిల్లా : బస్సు ఎక్కిన ప్రాణమున్న ప్రతీ జీవికి బస్ టికెట్ తీసుకోవాలంటూ తెంగాన ఆర్టీసీ బస్సులో కోడిపుంజుకు టికెట్ తీసుకున్నాడు ఓ కండక్టర్. అది కూడా కోడి పుంజుకు ఫుల్ టికెట్ కొట్టడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇది కాస్త టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లింది. దీంతో సజ్జనార్ వెంటనే స్పందించారు. కోడిపుంజుకు టికెట్..ఆ పై ఏం జరిగిందంటే..?నిజానికి బస్సులో పక్షులు, కుక్కలు, పిల్లులు మొదలగు పశుపక్షాదులకు ప్రవేశం లేదని చెప్పారు. అయితే అలీ అనే వ్యక్తి రామగుండం సమీపంలో కోడిపుంజుతో కరీంనగర్ కు వెళ్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఎక్కాడు. అయితే ఈ కోడిపుంజును బస్సు కండక్టర్ తిరుపతి సుల్తాన్ బాద్ దగ్గర గుర్తించాడు. అప్పుడు కండక్టర్ ఆ ప్రయాణికుడిని ప్రశ్నించాడు.

అదే సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ న్యూస్ రిపోర్టర్ కోడిపుంజుకు కూడా టికెట్ తీసుకోమని పదే పదే చెప్పాడు. హాట్ న్యూస్ కోసం ఆ రిపోర్టర్ ప్రోత్సహించగా, కండక్టర్ ఆ ప్రభావంతో కోడిపుంజుకు ఫుల్ టికెట్ రూ.30 తీసుకున్నాడు. అయితే అప్పుడు ఆ రిపోర్టర్ మాటలను విని అలా టికెట్ తీసుకుని ఉండాల్సింది కాదు.. అయినప్పటికీ కోడిపుంజుకు ఫుల్ టికెట్ కొట్టిన కండక్టర్ పై చర్యలు తీసుకుంటామని సజ్జనార్ ఓ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా సజ్జనార్ ప్రకటించారు.