ఉగ్రవాద దాడిలో 27 మంది సైనికులు మృతి

ఉగ్రవాద దాడిలో 27 మంది సైనికులు మృతి

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : మాలీలో మిలిటరీ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడిచేశారు. దీంతో 27 మంది జవాన్లు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురి ఆచూకీ లభించడం లేదని ప్రభుత్వం తెల్పింది. సెంట్రల్ మాలీలోని గ్రామీణ ప్రాంతమైన మోడోరోలో ఉన్న మిలిటరీ క్యాంపుపై కారు బాంబులతో దాడి చేశారని వెల్లడించింది. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో 70 మంది దాకా ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నది.ఉగ్రవాద దాడిలో 27 మంది సైనికులు మృతికాగా, ఇప్పటి వరకు దాడికి బాధ్యతవహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. సెంట్రల్ మాలీలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2012 లో ఉత్తరాన ఉన్న ఎడారి ప్రాంతాన్ని అల్ ఖైదాకు సంబంధించిన మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఫ్రాన్స్ సైన్యం రంగంలోకి దిగి వారిని అంతమొందించింది. మళ్లీ పుంజుకున్న ఉగ్రవాద సంస్థలు క్రమంగా తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మాలి సరిహద్దుల్లో ఉన్న బుర్కినాఫాసో, నైగర్ దేశాలకు విస్తరించాయి.