కార్యకర్తలతో కలిసి, ఎల్బీ స్టేడియానికి బస్సులో బయల్దేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితహైదరాబాద్: జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం ఎల్బీ స్టేడియం లో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభకు నగరం నలుమూలల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఈ సభకు హాజరయ్యేందుకు, బస్సులో బయల్దేరారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ బస్సు లో సభా ప్రాంగణానికి వెళ్లారు.