సిడ్నీ: ఆసీస్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా జట్టు పోరాడి ఓటమిపాలైంది. ఆసీస్ నిర్ధేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ చేరుకోలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(85:61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో ఒంటరి పోరాటం చేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రారంభంలో ఓపెనర్ శిఖర్ ధావన్(28:21 బంతుల్లో3ఫోర్లు), చివరలో హార్ధిక్ పాండ్య(20:13 బంతుల్లో1 ఫోర్, 2 సిక్సర్లు) చేశారు. ఇతర బ్యాట్స్మెన్స్ సహకారం లేకపోవడంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 12 పరుగులతో తేడాతో విజయాన్ని దక్కించుకుంది.