స్పోర్ట్స్ డెస్క్ : టీమీండియాతో డే అండ్నైట్ టెస్టు మ్యాచ్లో బ్యాట్స్మెన్లు తడబడడంతో ఆతిథ్య ఆసీస్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 72.1 ఓవర్లలో 191 రన్స్కే అలౌటైంది. దీంతో భారత్కు 53 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులకు అలౌటైంది. తొలి టెస్టులో టీమీండియా మెరుగైన స్థితిలో నిలిచింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(4/55) తన మాయాజలంతో కంగారూల పతనాన్ని శాసించాడు. బుమ్రా (2/52), ఉమేశ్యాదవ్(3/40)లకు వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్పైన్(73 నాటౌట్) ఒక్కడే అర్ధశతకంతో మెరిశాడు. టీమీండియా బౌలర్ల కట్టుదిట్టమైన బంతులను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తడబడ్డారు. గులాబీ టెస్టు రెండో రోజు ఆటలో టీమీండియాదే పై చేయి. 29 రన్స్కే ఓపెనర్లు మాథ్యూవేడ్(8)జోబర్న్(8) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన లబుషేన్ (47) బౌలర్లను ధాటిగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. లబుసేన్ 54 ఓవర్లో ఔటయ్యాడు. ఉమేశ్యాదవ్ వేసిన అదే ఓవర్లో లబుషేన్తో పాటు అప్పుడే క్రీజులోకి వచ్చిన పాట్ కమిన్స్ డకౌట్ గా వెనుదిరిగాడు. స్టీవ్ స్మిత్(1), ట్రావిస్హెడ్(7)లను ఆశ్విన్ పెవిలియన్ పంపడంతో ఆస్ట్రేలియా ఒత్తిడికి గురైంది. చివరి వరకు క్రీజులో నిలదొక్కుకున్న పైన్ కాస్త వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపించే ప్రయత్నం చేశాడు.