విజయవాడ: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వేణుగోపాలరావు అన్నారు. యనమలకుదురులో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీని వారు ప్రారంభించారు. క్రీడారంగానికి విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. భావి చాంపియన్లకోసం క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముంబాయి, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఇటువంటి అకాడమీలు ఉన్నాయని తెలిపారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని సాధించుకునే దిశగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. 14 ఏళ్ల వయసు పిల్లలే కాకుండా 30 ఏళ్లు వాళ్లకు కూడా ఈ అకాడమీ లో ఆడవచ్చని తెలిపారు .చదువులు, ఉద్యోగాలతో బిజీ గా ఉన్నవారు ఫ్లడ్ లైట్ల కాంతిలో సాధన చేయవచ్చని తెలిపారు.