హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం ద్వారా నిర్వహిస్తున్న వివిధ కోర్సుల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. పరీక్షలను డిసెంబర్ 7 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. బీఏ (స్పెషల్ తెలుగు, కర్ణాటక సంగీతం), ఎంఏ (తెలుగు, సంస్కృతం, కమ్యూనికేషన్ జర్నలిజం, టూరిజం మేనేజ్మెంట్, ఈఎల్టీ), పీజీ డిప్లొమా (టీవీ జర్నలిజం), డిప్లొమా (లలిత సంగీతం, జ్యోతిషం), సర్టిఫికెట్ ఇన్ జ్యోతిషం, సంగీత విశారద కోర్సుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నది. మరిన్ని వివరాలకు www.teluguuniversity.ac.in బెబ్ సైట్ లో చూడవచ్చు.