రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి పట్టణంలో నిర్మించిన పార్టీ కార్యాలయం ప్రగతిభవన్ను సందర్శించారు. అనాథ వృద్ధులను ఆదుకోనేందుకు నియోజకవర్గంలో మండలానికో వృద్ధాశ్రమాన్ని సొంత ఖర్చులతో నిర్మించనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల విద్యుత్ సంస్ధ సహకార ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు నాయకులు పాల్గొన్నారు.