24 న వస్తున్న “మర్డర్”

24 న వస్తున్న "మర్డర్"హైదరాబాద్​ : అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతి లు నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం మర్డర్ డిసెంబర్ 24 న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ జయభేరి క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ‘”మర్డర్” సినిమా ఎన్నో నిజ జీవితాలపై తీసిన యదార్థ కథ. ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నాం. కాబట్టి మేము 22వ తేదీన మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ సినిమా పిల్లలకు తల్లిదండ్రులకు జరిగే కంటిన్యూ యుద్ధం. వారి ఇష్టాలను కాదన్నపుడు చాలామందికి ఏం నష్టం జరుగుతుందనేది ఈ చిత్రం ద్వారా తెలుపుతున్నామని’ అన్నారు దర్శకుడు రాంగోపాల్​ వర్మ. ‘ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు’దర్శకుడు ఆనంద్​చంద్ర. ‘కొంతమంది ఈ సినిమాపై వేసిన కేసుల అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ రాంగోపాల్ వర్మ”మర్డర్” సినిమాను ఈ నెల 24 న అన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నామని అన్నారు నిర్మాతలు.‘ఒక అమ్మాయి వారి తల్లిదండ్రులను కాదనుకొని బయటకు వెళ్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా లో దర్శకుడు చక్కగా చూయించారు అని’ హీరోయిన్​ గాయత్రిభార్గవీ అన్నారు.

నటీనటులు ..
శ్రీకాంత్ అయ్యంగార్,గాయత్రీ భార్గవి,సాహితీ, గిరిధర్ ,దీపక్, గణేష్

సాంకేతికవర్గం
నిర్మాతలు..నట్టి కరుణ /నట్టి క్రాంతి

దర్శకత్వం… ఆనంద్ చంద్ర

సంగీతం.. డి ఎస్ ఆర్

డిఓపి.. జగదీష్ చీకటి

ఎడిటర్ ..శ్రీకాంత్ పట్నాయక్. ఆర్

ప్రొడక్షన్ కంట్రోలర్..రామ్ మంతెన

పి ఆర్ ఓ.. మధు వి ఆర్