హైదరాబాద్: సౌత్ ఇండియన్ పాపులర్ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. టాలీవుడ్ హీరో నిఖిల్ విసిరిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన అనుపమ హైదరాబాద్లోని బాచుపల్లిలో మొక్కనాటారు. రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ మొదలుపెట్టిన ఈ గ్రీన్ఇండియా ఛాలెంజ్ను నేను స్వాగతిస్తున్నాను. భవిష్యత్లో దీన్ని ఇన్స్పైర్గా తీసుకుంటాను. ఈ కార్యక్రమం ద్వారా మొక్కలే వృక్షాలుగా మారి భావితరాలకు ఉపయోగపడి ప్రకృతి అందంగా తయారై అందరికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. అందరు ఆరోగ్యంగా ఉండడానికి మొక్కల్ని పెంచడం ఎంతో అవసరం అని అనుపమ తెలిపింది. ప్రకృతిలో మొక్కలను కాపాడుకునే ఇంత మంచి ఈగ్రీన్ ఇండియా ఛాలెంజ్లోకి అందరిని ఆహ్వానిస్తాను. దీని కోసం నావంతుగా కృషి చేస్తానని నటి అనుపమ చెప్పింది.