7 నుంచి కేయూ ఇంజినీరింగ్ తరగతులు

వరంగల్​ అర్బన్​: కేయూ పరిధిలోని ఇంజినీరింగ్​ ఫస్టియర్​ క్లాస్​లు డిసెంబర్​ 7వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆ డిపార్ట్​మెంట్​ డీన్​ ప్రొఫెసర్​ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేయూ పరిధిలోని ఇంజినీరింగ్​ కళాశాల ప్రినిపాళ్లతో ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో తరగతుల షెడ్యూల్​ను వెల్లడించారు. కార్యక్రమంలో కేయూ క్యాంపస్​ , కొత్తగూడెం ఇంజినీరింగ్​ కాలేజీ ప్రిన్సిపాళ్లు మల్లారెడ్డి , డాక్టర్​ రమణ , వినూత్న కాలేజీ చైతన్య కాలేజీ, విట్స్​ కాలేజీ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.