కృష్ణాజిల్లా: జనసేన అధినేత, సినీనటుడు పవన్కల్యాణ్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ నియోజకవర్గంలోని డోకిపర్రు గ్రామానికి పవన్ రానున్నారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో గన్నవరం రానున్న పవన్ అక్కడ నుంచి నేరుగా గుడివాడకు చేరుకుంటారు. అనంతరం గుడ్లవల్లేరు మీదుగా డోకిపర్రు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. జన సేనాని పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. డోకిపర్రులో శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభయ్యాయి. ఇక ఈ దేవస్థానం మెగా సంస్థల యాజమాన్యానికి చెందినదన్న సంగతి విదితమే.