పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యం రెండో స్ధానంలో టీఆర్ఎస్
హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
మొదట పోస్టల్ బ్యాలెట్ను అధికారులు లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది. టీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. ఎంఐఎం మూడో స్థానం, కాంగ్రెస్ నాలుగో స్ధానంలో ఉందని అధికారులు ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి 84, టీఆర్ఎస్కు 30, ఎంఐఏం 17 , కాంగ్రెస్ 2 ఓట్లను సాధించింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సాధారణ ఓట్లలో కనిపించదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కానీ ఇదే వేవ్ చివరి వరకు కొనసాగుతుందని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. కాసేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.