బాక్సింగ్​డే టెస్టులో మార్పులు

బాక్సింగ్​డే టెస్టులో మార్పులుమెల్​బోర్న్​​ : ఆతిథ్య ఆసీస్​తో బాక్సింగ్​ డే జట్టుకు భారత్​ తుది జట్టులో నాలుగు మార్పులు చేయనుంది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ మిగిలిన టెస్టులకు అందుబాటులో ఉండకపోవడంతో అజింక్య రహానె జట్టుకు నాయకత్వం వహిస్తాడు. వెటరన్​ వికెట్​ కీపర్​-బ్యాట్స్​మెన్​ వృద్ధిమాన్​ సాహా, యంగ్​ ఓపెనర్​ పృథ్వీషాలను జట్టు నుంచి తప్పించనున్నారు. ఆడిలైడ్​ టెస్టులో బ్యాటింగ్ లైనప్​ కుప్పకూలడంతో బ్యాటింగ్​లో​ మార్పులు చేస్తున్నారు. రెండో టెస్టు డిసెంబర్​ 26న మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో ప్రారంభంకానుంది. కాగా నాలుగు టెస్టుల సిరీస్​లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది. సాహా బ్యాటింగ్​ ఎలాంటి నమ్మకాన్ని కలిగించకపోవడంతో టీమ్​ మేనేజ్​మెంట్​ యువ క్రికెటర్​ రిషబ్​ పంత్​పై చూస్తోంది. వార్మప్​ మ్యాచ్​లో పంత్​ శతకంతో చెలరేగడం, ఆస్ట్రేలియా పిచ్​లపై కీపింగ్​ బాధ్యతలు నిర్వర్తించడం పెద్ద సమస్యకాదని మేనేజ్​మెంట్​ భావిస్తోంది. తర్వాతి మూడు టెస్టుల్లో పంత్​ మంచి ప్రదర్శన చేస్తే ఇంగ్లాండ్​తో సిరీస్​కు అతడు ఎంపికయ్యే అవకాశాలు ఉండనున్నాయి. అలాగే ఘోరమైన వైఫల్యంతో విమర్శలు ఎదుర్కొన్న పృథ్వీషా స్థానంలో ఫామ్​లో ఉన్న శుభ్​మన్​గిల్​కు చోటు దక్కనుంది. కోహ్లీ స్థానాన్ని కేఎల్​ రాహుల్​ భర్తీ చేయనున్నాడు. గాయంతో సిరీస్​ నుంచి తప్పుకున్న సీనియర్​ పేసర్​ మహ్మద్​ షమీ స్థానలో చోటు చోసం మహ్మద్​ సిరాజ్​ ఆసక్తిగా చూస్తున్నాడు. హనుమ విహారిని బ్యాటింగ్​లో ముందుగా పంపాలని కూడా ఆలోచనలు చేస్తున్నారు. కాగా మూడో టెస్టులో రోహిత్​ శర్మ అందుబాటులోకి వస్తే బ్యాటింగ్​ లైనప్​లో మళ్లీ మార్పులు చోటుచేసుకోవచ్చు.

రెండో టెస్టుకు టీమీండియా అంచనా
మయాంక్​ అగర్వాల్​, శుభమన్​గిల్​, పుజారా, కేఎల్​రాహుల్​, రహానె హనుమవిహారి,పంత్​, అశ్విన్​, మహ్మద్​సిరాజ్​, బుమ్రా, ఉమేశ్​యాదవ్​​